భక్తిశ్రద్ధలతో మాస శివరాత్రి

ABN , First Publish Date - 2022-11-22T23:19:23+05:30 IST

మండల కేంద్రంలోని తిరుమనకొండలో వెలసి ఉన్న శ్రీరాజరాజేశ్వరీదేవి సమేత శ్రీకాశీ విశ్వేశ్వరస్వామి ఆలయంలో మాస శివరాత్రి పురస్కరించుకుని మంగళవారం భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు.

భక్తిశ్రద్ధలతో మాస శివరాత్రి
హోమంలో పాల్గొన్న భక్తులు

సంగం, నవంబరు 22: మండల కేంద్రంలోని తిరుమనకొండలో వెలసి ఉన్న శ్రీరాజరాజేశ్వరీదేవి సమేత శ్రీకాశీ విశ్వేశ్వరస్వామి ఆలయంలో మాస శివరాత్రి పురస్కరించుకుని మంగళవారం భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పీఠాధిపతి రాజరాజేశ్వరానందస్వామి ఆధ్వర్యంలో వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ శివలింగానికి క్షీర, పంచామృతాలతో అభిషేకాలు చేశారు. అనంతరం హోమం నిర్వహించారు. తర్వాత ప్రాంగణంలో ఉన్న ఉసిరి చెట్టు కింద వన భోజనాలు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఆర్యవైశ్యులు ఉభయ కర్తలుగా వ్యవహరించారు. భక్తులు అధికసంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

Updated Date - 2022-11-22T23:19:24+05:30 IST