సాంస్కృతిక మేళాను జయప్రదం చేయండి
ABN , First Publish Date - 2022-11-23T23:33:01+05:30 IST
సీఐటీయూ జిల్లా మహాసభలు డిసెంబరు 11, 12 తేదీల్లో పట్టణంలో జరుగుతున్న నేపథ్యంలో, ఘంటసాల శతజయంతి ఉత్సవాల్లో భాగంగా పాఠశాల, కళాశాల విద్యార్థులకు ప్రతిభ పోటీలు, సాంస్కృతిక మేళా నిర్వహించడం జరుగుతుందని సీఐటీయూ నాయకుడు జీ శివప్రసాద్ తెలిపారు.
ఆత్మకూరు, నవంబరు 23 : సీఐటీయూ జిల్లా మహాసభలు డిసెంబరు 11, 12 తేదీల్లో పట్టణంలో జరుగుతున్న నేపథ్యంలో, ఘంటసాల శతజయంతి ఉత్సవాల్లో భాగంగా పాఠశాల, కళాశాల విద్యార్థులకు ప్రతిభ పోటీలు, సాంస్కృతిక మేళా నిర్వహించడం జరుగుతుందని సీఐటీయూ నాయకుడు జీ శివప్రసాద్ తెలిపారు. స్థానిక డాక్టర్ చెర్లో రమణారెడ్డి భవన్లో బుధవారం సాంస్కృతిక మేళా గోడపత్రికలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 25న విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు నిర్వహించనున్నామని పేర్కొన్నారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు డిసెంబరు 5, 6 తేదీల్లో మండల స్థాయిలో పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్చైర్మన్ షేక్ సంధాని, సీఐటీయూ నాయకులు కొండమూరి హజరత్తయ్య, నరసింహులు, ప్రజానాట్య మండలి కళాకారులు గద్దర్, షుకూర్ తదితరులు పాల్గొన్నారు.