టీడీపీ నేత కోటంరెడ్డికి కరోనా
ABN , First Publish Date - 2022-07-06T04:36:00+05:30 IST
టీడీపీ నగర ఇన్చార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి కరోనా బారిన పడ్డారు.
నెల్లూరు, జూలై 5 (ఆంధ్రజ్యోతి) : టీడీపీ నగర ఇన్చార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి కరోనా బారిన పడ్డారు. మంగళవారం ఉదయం నుంచి శరీరం నలతగా ఉండడంతో ఆయన కరోనా పరీక్ష చేయించుకోగా పాజిటివ్ అని తేలింది. చిన్నపాటి లక్షణాలు మాత్రమే ఉన్నాయని, కార్యకర్తలు, అభిమానులెవరూ ఆందోళన చెందవద్దని కోటంరెడ్డి సూచించారు. ఇటీవల తనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరారు