‘మాండస్’తో మారిన వాతావరణం
ABN , First Publish Date - 2022-12-08T23:14:26+05:30 IST
బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ మాండస్ ప్రభావంతో గురువారం మధ్యాహ్నం నుంచి కావలి ప్రాంతంలో చీకట్లు కమ్ముకుంటూ చలి పెరిగి వాతావరణంలో ఒక్క సారిగా మార్పులు వచ్చాయి.
కావలి, డిసెంబరు8: బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ మాండస్ ప్రభావంతో గురువారం మధ్యాహ్నం నుంచి కావలి ప్రాంతంలో చీకట్లు కమ్ముకుంటూ చలి పెరిగి వాతావరణంలో ఒక్క సారిగా మార్పులు వచ్చాయి. మూడు రోజులు పాటు వర్షాలు పడతాయని వాతావరణ వాఖ హెచ్చరిస్తుండటంతో కావలిడివిజన్లోని మెట్టప్రాంత రైతులు ఆందోళన చెందుతున్నారు. అధిక వర్షాలు కురిస్తే మినుము, పొగాకు, మిర్చి, శనగ రైతులకు తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉంది. గత వర్షాలకే అనేక చోట్ల మిర్చి, మినుము దెబ్బతిన్నాయి. మళ్లీ వర్షాలు అధికమైతే మినుము, మిర్చితోపాటు ఈసారి పొగాకు ,శనగ పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉంది.