జూలై 14న చలో నెల్లూరు: TDP

ABN , First Publish Date - 2022-07-14T00:53:42+05:30 IST

అమరావతి: పోలీసుల చిత్రహింసలను నారాయణ అవమానంగా భావించి ఆత్మహత్య చేసుకున్నాడని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. పోలీసుల తీరుకు నిరసనగా జూలై 14వ తేదీ చలో నెల్లూరుకు పార్టీ

జూలై 14న చలో నెల్లూరు: TDP

అమరావతి: పోలీసుల చిత్రహింసలను నారాయణ అవమానంగా భావించి ఆత్మహత్య చేసుకున్నాడని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. పోలీసుల తీరుకు నిరసనగా జూలై 14వ తేదీ చలో నెల్లూరుకు పార్టీ నాయకులు పిలుపునిచ్చారు.


పోలీసులు చిత్రహింసలు పెట్టారు

నెల్లూరు రూరల్  పరిధిలోని పొదలకూరు మండలంలోని బ్రిక్స్‌ ఫ్యాక్టరీలో ఎలక్ట్రికల్‌ సామగ్రి చోరీ అయ్యింది. దీంతో ఫ్యాక్టరీ యజమాని వంశీకృష్ణ కందమూరు గ్రామంలోని నారాయణ ఇంటికి వెళ్లి దొంగతనం ఆరోపణలు మోపి బెదిరింపులకు గురి చేశాడు. దీంతో మనస్తాపానికి గురైన నారాయణ గ్రామంలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వంశీకృష్ణ వేధింపుల వల్ల నారాయణ బలవన్మరణానికి పాల్పడ్డాడని కుటుంబసభ్యులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతనిపై అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. కాగా నారాయణను పోలీసులు స్టేషన్‌కు పిలిపించి చిత్రహింసలకు గురిచేయడంతో అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. పోలీసుల తీరుకు నిరసనగా జూలై 14వ తేదీ చలో నెల్లూరుకు టీడీపీ పిలుపునిచ్చింది. అయితే టీడీపీ నిరసనకు అనుమతి లేదని ఎస్పీ విజయారావు పేర్కొన్నారు.

Updated Date - 2022-07-14T00:53:42+05:30 IST