బడుగుల ఆశాజ్యోతి జ్యోతిరావుఫూలే

ABN , First Publish Date - 2022-11-28T21:47:20+05:30 IST

బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావుఫూలే అని మున్సిపల్‌ వైస్‌చైర్మన్లు డాక్టర్‌ శ్రావణ్‌కుమార్‌, షేక్‌ సర్దార్‌, పలువురు వైసీపీ నేతలు పేర్కొన్నారు.

బడుగుల ఆశాజ్యోతి జ్యోతిరావుఫూలే
ఆత్మకూరు : జ్యోతిరావుఫూలే చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న వైసీపీ నేతలు

ఆత్మకూరు, నవంబరు 28: బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావుఫూలే అని మున్సిపల్‌ వైస్‌చైర్మన్లు డాక్టర్‌ శ్రావణ్‌కుమార్‌, షేక్‌ సర్దార్‌, పలువురు వైసీపీ నేతలు పేర్కొన్నారు. ఆత్మకూరులోని ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో సోమవారం ఫూలే వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫూలే బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేశారని కొనియాడారు. ముందుగా ఫూలే చిత్రపటానికి పూలమా లలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైౖర్మన్‌ నాగులపాటి ప్రతాప్‌రెడ్డి, పలువురు కౌన్సిలర్లు, వైసీపీ నేతలు పాల్గొన్నారు.

సంగం : స్థానిక గ్రంథాలయంలో పూలే వర్ధంతి సందర్భంగా సోమవారం ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళలు అర్పించారు. లైబ్రియన్‌ రవీంద్రనాథ్‌రెడ్డి జ్యోతిరావ్‌ పూలే చేసిన సేవలను వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

అనంతసాగరం : మండలంలోని రేవూరు ఎస్సీ బాలుర వసతిగృహం, అనంతసాగరం సచివాలయం-1లో సోమవారం జ్యోతిరావ్‌ ఫూలే వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలుగు భారతి సేవా సమితి అధ్యక్షుడు వీ.నారాయణరావు, వార్డెన్‌ నిరంజన్‌, గ్రంథాలయాధికారి నారాయణరావు, సచివాలయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-28T21:47:21+05:30 IST