పాపిరెడ్డిపాలెంలో విషాదం
ABN , First Publish Date - 2022-12-09T22:58:17+05:30 IST
మండలంలోని పాపిరెడ్డిపాలెం గ్రామంలో శుక్రవారం ట్రాక్టర్ కేజీ వీల్స్ కిందపడి డ్రైవర్ మృతి చెందాడు.
తోటపల్లిగూడూరు, డిసెంబరు 9 : మండలంలోని పాపిరెడ్డిపాలెం గ్రామంలో శుక్రవారం ట్రాక్టర్ కేజీ వీల్స్ కిందపడి డ్రైవర్ మృతి చెందాడు. పోలీసుల సమాచారం మేరకు మండలంలోని పాపిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన డ్రైవర్ ఈదూరు శీనయ్య (46) స్థానిక రైతు పొలంలో దుక్కి దున్నేందుకు వెళ్లాడు. దున్నిన తర్వాత ట్రాక్టర్ బురద కడిగేందుకు ఇంజన్ను రన్నింగ్లో పెట్టి కిందికి దిగాడు. ప్రమాదవశాత్తూ చేతికి గేర్ రాడ్ తగిలి ట్రాక్టర్ వెనక్కి రావడంతో కేజీ వీల్స్ కింద పడి మృతి చెందాడు. శీనయ్య మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. డ్రైవర్ కుమారుడు ఈదూరు సుమంత్ ఇచ్చిన ఫిర్యాదుతో ఎస్ఐ ఇంద్రసేనారెడ్డి కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు తెలిపారు.