అన్యాయాలను సవరించాలి
ABN , First Publish Date - 2022-02-20T02:48:25+05:30 IST
11వ పే రివిజన్లో జరిగిన అన్యాయాలను సవరించాలని ఏఫీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి చిరంజీవి అన్నారు.
గూడూరు, ఫిబ్రవరి 19: 11వ పే రివిజన్లో జరిగిన అన్యాయాలను సవరించాలని ఏఫీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి చిరంజీవి అన్నారు. శనివారం చెన్నూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో సీఎంకు పంపిన విజ్ఞాపన పత్రాలతో నిరసన ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐఆర్కు సమానమైన ఫిట్మెంట్ , 2020 ఏప్రిల్ నుంచి గ్రాట్యుటీ అమలు, సీపీఎస్ రద్దు, కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీస్ క్రమబద్ధీకరణ తదితర సమస్యలను పరిష్కరించాలని సీఎంకు వినతిపత్రాలను పంపామన్నారు. కార్యక్రమంలో మల్లికార్జున, సందానీ, శ్రీవాణి, వసంతకుమారి, లోకేశ్వరి, వరలక్ష్మి, శ్రీలక్ష్మి, శంకరయ్య, సురేష్బాబు, శ్రీనివాసులు తదితరులు పాల్గొ న్నారు.