జనసేన సభ్యత్వ నమోదు
ABN , First Publish Date - 2022-02-24T03:25:31+05:30 IST
మండలంలోని జమ్మలపాలెంలో బుధవారం జనసేన పార్టీ సభ్యత్వ నమోదును నిర్వహిం చారు. పార్టీ మండల అధ్యక్షుడు తోట మురళి ఆధ్వర్యంలో జరిగి
జలదంకి, ఫిబ్రవరి23: మండలంలోని జమ్మలపాలెంలో బుధవారం జనసేన పార్టీ సభ్యత్వ నమోదును నిర్వహిం చారు. పార్టీ మండల అధ్యక్షుడు తోట మురళి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గ నేత నిమ్మళ్లపల్లి రామ్చైతన్య పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికీ రూ.5లక్షలు ప్రమాద బీమా, ప్రమాదంలో ఆసుపత్రి పాలైన వారికి చికిత్స కోసం రూ.50వేలు ఇవ్వనున్నట్లు పేర్కొ న్నారు. సభ్యత్వ నమోదులో గ్రామంలోని జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.