రెండేళ్ల తర్వాత మెమురైలు రాక
ABN , First Publish Date - 2022-01-04T04:50:56+05:30 IST
నెల్లూరు-చెన్నై మెము రైలు దాదాపు రెండేళ్ల తరువాత సోమవారం పునః ప్రారంభమైంది.
నాయుడుపేట, జనవరి 3 : నెల్లూరు-చెన్నై మెము రైలు దాదాపు రెండేళ్ల తరువాత సోమవారం పునః ప్రారంభమైంది. మెము రైలుకోసం 3 నెలలుగా ఫుట్బాల్ కోచ్ గౌస్బాషా, హిందీ ఉపాధ్యాయుడు ఫజీల్ రైల్వే ఉన్నతాధికారులకు అనేక పర్యాయాలు వినతిపత్రాలను అందజేశారు. రైల్వే మంత్రి కార్యాలయానికి కూడా దరఖాస్తులు అందజేశారు. ఎట్టకేలకు మెము రైలురావడంతో వారు రైలు డ్రైవర్, స్టేషన్ మాస్టర్ అలెగ్జాండర్ను పూలమాలలతో సత్కరించారు.