11 కిలోల గంజాయి పట్టివేత
ABN , First Publish Date - 2022-03-17T05:19:02+05:30 IST
అక్రమంగా రవాణా చేస్తున్న 11 కిలోల గంజాయిని ఎస్ఈబీ అధికారులు పట్టుకున్నారు.
తడ, మార్చి 16 : అక్రమంగా రవాణా చేస్తున్న 11 కిలోల గంజాయిని ఎస్ఈబీ అధికారులు పట్టుకున్నారు. ఎస్ఈబీ ఇన్స్పెక్టర్ ప్రసాద్ వివరాల మేరకు ఎస్ఈబీ అడిషనల్ ఎస్పీ ఆదేశాల మేరకు బుధవారం భీములవారిపాళెం చెక్పోస్టు వద్ద తనిఖీలో భాగంగా నెల్లూరు నుంచి చెన్నైకు వెళ్తున్న తమిళనాడు ఆర్టీసీ బస్సులో ఒడిసా రాష్ట్రానికి చెందిన పంకజ్బిబార్, జగుస్టిషాహులు అనుమానాస్పదంగా ఉండటంతో వారి లగేజీలను తనిఖీలు చేశారు. వారి నుంచి 11 కిలోల గంజాయిని గుర్తించి పట్టుకున్నారు. ఒడిస్సా నుంచి గంజాయిని చెన్నైకు తరలిస్తున్నారని, దాని విలువ సుమారు రూ. లక్షవరకు ఉండవచ్చునని అధికారులు తెలిపారు. దాడుల్లో ఎస్ఈబీ ఇన్స్పెక్టర్, ఎస్ఐ ప్రతాప్కుమార్, సిబ్బంది రసూల్, సీ వెంకటేశ్వర్లు, ఎన్. ప్రభాకర్రావు, ఎం. వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.