వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కన్నీటి పర్యంతం

ABN , First Publish Date - 2022-04-10T23:38:46+05:30 IST

కేబినెట్ పదవులు వైసీపీ ఆశావహుల్లో భావోద్వేగాన్ని కలిగిస్తున్నాయి. కొత్త కేబినేట్‎లో పదవి దక్కుతుందని గంపెడు ఆశలు పెట్టుకున్న నేతలకు కొత్త మంత్రుల లిస్టు కన్నీటిని..

వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కన్నీటి పర్యంతం

నెల్లూరు: కేబినెట్ పదవులు వైసీపీ ఆశావహుల్లో భావోద్వేగాన్ని కలిగిస్తున్నాయి. కొత్త కేబినేట్‎లో పదవి దక్కుతుందని గంపెడు ఆశలు పెట్టుకున్న నేతలకు మంత్రుల లిస్టు కన్నీటిని తెప్పిస్తోంది. తమకు పదవి రాకుండా పోతోందనే ఆవేదన కళ్ల నుంచి నీటి రూపంలో ఒక్కసారిగా బయటకు వస్తోంది. పండగ పూట నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒక్కసారిగా కన్నీటి పర్యంతమయ్యారు. లిస్టులో తన పేరు లేదని భావోద్వేగం వ్యక్తం చేశారు. తనకు మంత్రి పదవి దక్కడంలేదని వాపోయారు. అయినా సీఎం జగన్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని తెలిపారు. పార్టీ గెలుపు కోసం కృష్టి చేస్తానని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పారు. 


ఏపీ నూతన మంత్రివర్గం పునర్వ్యవస్థీకరణ దాదాపు ఓ కొలిక్కి వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌ కొత్త మంత్రివర్గంలోకి 10 మంది పాత వారికి చోటు కల్పిస్తూ 15 మంది కొత్తవారికి అవకాశం కల్పించారు. 


ఏపీ మంత్రుల తుది జాబితా ఇదే...

విజయనగరం జిల్లా: బొత్స, రాజన్నదొర

శ్రీకాకుళం జిల్లా: ధర్మాన ప్రసాదరావు, అప్పలరాజు

విశాఖ జిల్లా: భాగ్యలక్ష్మి, గుడివాడ అమర్నాధ్

తూ.గో జిల్లా: దాడిశెట్టి రాజా, చిట్టి బాబు, వేణుగోపాల కృష్ణ

ప.గో: జిల్లా: కారుమూరి నాగేశ్వరరావు, గ్రంధి శ్రీనివాస్

కృష్ణాజిల్లా: జోగి రమేష్, కొడాలి నాని, రక్షణనిధి

గుంటూరు జిల్లా: విడదల రజనీ, మేరుగ నాగార్జున

ప్రకాశం జిల్లా: ఆదిమూలపు సురేష్ 

నెల్లూరు జిల్లా: కాకాణి గోవర్దన్ రెడ్డి

చిత్తూరు జిల్లా: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

కడప జిల్లా: అంజాద్ బాషా, కొరుముట్ల శ్రీనివాస్

కర్నూలు జిల్లా: శిల్పా చక్రపాణి రెడ్డి, గుమ్మనూరు జయరాం

అనంతపురం జిల్లా: జొన్నలగడ్డ పద్మావతి, శంకర్ నారాయణ 


ఇక 25 మంది నూతన మంత్రుల జాబితా కాసేపట్లో గవర్నర్ వద్దకు వెళ్లనుంది. 25 మంది ఎమ్మెల్యేలకు ఇప్పటికే  సీఎంవో కార్యాలయం నుంచి వెళ్లినట్లు సమాచారం. 


Updated Date - 2022-04-10T23:38:46+05:30 IST