Nara Lokesh: ఇకపై జగన్ సర్కార్తో యుద్ధమే
ABN , First Publish Date - 2022-08-22T04:24:48+05:30 IST
ఇకపై జగన్ సర్కార్తో యుద్ధమేనని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. పలాస టూర్కు అనుమతి లేదని...
విశాఖ: ఇకపై జగన్ సర్కార్తో యుద్ధమేనని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) అన్నారు. పలాస టూర్కు అనుమతి లేదని లోకేష్ను విశాఖ ఎయిర్ పోర్టు (Visakha Airport)లో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన తిరిగి హైదరాబాద్ (Hyderabad) బయల్దేరారు. ఈ సందర్బంగా లోకేశ్ మాట్లాడుతూ కోర్టు అనుమతితో మళ్లీ పలాస వస్తానన్నారు. టీడీపీ కార్యకర్తలకు భరోసా ఇస్తానని చెప్పారు. పోలీసులు వైసీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో సామాన్యులు బతకలేని పరిస్థితి ఉందని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.