Nara Lokesh : జగన్‌ను అడ్డుకోవాల్సిన అవసరం మాకు లేదు

ABN , First Publish Date - 2022-12-30T10:33:08+05:30 IST

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో సీఎం జగన్ రెడ్డి పర్యటన సందర్భంగా టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు.

Nara Lokesh : జగన్‌ను అడ్డుకోవాల్సిన అవసరం మాకు లేదు

Nara Lokesh : అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో సీఎం జగన్ రెడ్డి పర్యటన సందర్భంగా టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. అరెస్ట్ చేసిన ప్రతిపక్ష పార్టీల వారిని వెంటనే విడుదల చెయ్యాలని కోరారు. జగన్‌ను అడ్డుకోవాల్సిన అవసరం తమకు ఏ కోశానా లేదన్నారు. చెత్త పరిపాలన, అసమర్థ ముఖ్యమంత్రి అంటూ వైసీపీకి చెందిన సొంత సామాజిక వర్గం నేతలే తిరుగుబాటు చేస్తున్నారని నారా లోకేష్ పేర్కొన్నారు. ఇతర పార్టీల నేతల అరెస్టులు మాని సీఎం పర్యటనలు ఉన్నప్పుడు వైసీపీ నేతల్ని అరెస్ట్ చెయ్యాలని పోలీసులను తాను ప్రత్యేకంగా కోరుతున్నానన్నారు. ఎందుకంటే చెత్త పరిపాలనపై ఒళ్లు మండిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు మాత్రమే ఆయన్ని అడ్డుకుని నిలదీసే అవకాశం ఉందని నారా లోకేష్ పేర్కొన్నారు.

Updated Date - 2022-12-30T10:33:10+05:30 IST