Nandigama: మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల వద్ద TDP నిరసన
ABN , First Publish Date - 2022-07-07T17:43:14+05:30 IST
జిల్లాలోని నందిగామ నెహ్రూనగర్లో గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల వద్ద గురువారం ఉదయం టీడీపీ నిరసన కార్యక్రమం చేపట్టింది.
ఎన్టీఆర్ జిల్లా: జిల్లాలోని నందిగామ నెహ్రూనగర్లో గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల వద్ద గురువారం ఉదయం టీడీపీ (TDP) నిరసన కార్యక్రమం చేపట్టింది. మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య (Tangairala sowmya), టీడీపీ నాయకులు(TDP leaders) నిరసనలో పాల్గొన్నారు. ప్రాథమిక విద్యను నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వ విధానంపై ఆందోళనకు దిగారు. గతంలో ఉన్న విద్యా విధానాన్ని అమలు చేయాలని తంగిరా సౌమ్య డిమాండ్ చేశారు. అమ్మ ఒడి, విద్యా దీవెనను తగ్గించుకోవడానికి ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. నాడు నేడు పేరుతో నాణ్యత లోపాలతో నిర్మాణాలు జరుగుతున్నాయని సౌమ్య ఆరోపించారు.