AP News: మావోయిస్టు పోస్టర్లు కలకలం
ABN , First Publish Date - 2022-09-18T03:03:09+05:30 IST
మావోయిస్టు పార్టీ (maoist party) 18వ వార్షికోత్సవాలను విప్లవోత్సవంగా దృఢసంకల్పంతో జరుపుకుందామని పిలుపునిస్తూ
ఏలూరు: మావోయిస్టు పార్టీ (maoist party) 18వ వార్షికోత్సవాలను విప్లవోత్సవంగా దృఢసంకల్పంతో జరుపుకుందామని పిలుపునిస్తూ శనివారం అల్లూరి సీతారామరాజు జిల్లా (Alluri (Sitharama Raju district)లో మావోయిస్టుల పోస్టర్లు వెలిశాయి. ఎటపాక మండలంలోని పిచుకలపాడు ప్రధాన రహదారి పక్కన ఉన్న బస్షెల్టర్ గోడలపై ఈ పోస్టర్లు (Posters) కనిపించడంతో కలకలం రేపాయి. బీకేఎస్ఆర్ డివిజన్ కమిటీ సీపీఐ (మావోయిస్టు) తెలంగాణ రాష్ట్ర కమిటీతో పేరుతో పోస్టర్లు వేశారు. ఈ పోస్టర్లలో సెప్టెంబరు 21 నుంచి 27 వరకు పార్టీ 18వ వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించుకుందామని, ప్రజా పునాదిని అభివృద్ధి చేసుకుంటూ, ప్రజా యుద్ధాన్ని పురోగమింపచేద్దామని అందులో పేర్కొన్నారు. శత్రు వ్యూహాత్మక సమాదాన్-ప్రహార్ దాడిని ఓడిద్దామని పిలుపునిచ్చారు. పోస్టర్ల విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వాటిని అక్కడ నుంచి తొలగించారు.