Nellore : 20 మీటర్ల మేర ముందుకొచ్చిన సముద్రం

ABN , First Publish Date - 2022-12-09T08:18:41+05:30 IST

మాండస్ తుఫాన్ ప్రభావంతో బంగాళాఖాతం అల్లకల్లోలంగా మారింది. అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి.

Nellore : 20 మీటర్ల మేర ముందుకొచ్చిన సముద్రం

Nellore : మాండస్ తుఫాన్ ప్రభావంతో బంగాళాఖాతం అల్లకల్లోలంగా మారింది. అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. గంటగంటకి‌ అలల ఉధృతి పెరుగుతోంది. పలుచోట్ల పది మీటర్ల నుంచి ఇరవై మీటర్ల దూరం మేర సముద్రం ముందుకు వచ్చింద. తీర ప్రాంత మత్స్యకార గ్రామాలన్నీ భయం గుప్పిట్లో కాలం వెళ్లదీస్తున్నాయి. సోమశిల‌ డ్యాంకి పై ఎత్తు నుంచి 6,017 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చి చేరుతోంది. డ్యాం పూర్తి సామర్ధ్యం 78 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 70.153 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. కలెక్టరేట్, తహశీల్దార్ కార్యాలయాల్లో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూం నెం.1077.

Updated Date - 2022-12-09T08:18:42+05:30 IST