Lokesh Fire: మహిళలను బెదిరించిన మంత్రి జోగి రమేష్...
ABN , First Publish Date - 2022-10-01T20:13:20+05:30 IST
మంత్రి జోగి రమేష్ (Jogi Ramesh)పై టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) మండిపడ్డారు.
అమరావతి (Amaravathi): మంత్రి జోగి రమేష్ (Jogi Ramesh)పై టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) మండిపడ్డారు. మంత్రి అయినా ఆయన లేకి పనులు మానుకోలేదంటూ ట్వీట్ (Tweet) చేశారు. ఇటీవల విజయవాడలో జరిగిన చేయూత కార్యక్రమంలో మహిళలను జోగి రమేష్ బెదిరించారు. మీటింగ్ మధ్యలో వెళ్లిపోతున్న మహిళలకు సంక్షేమ పథకాలు కట్ చేయాలంటూ వ్యాఖ్యలు చేశారు.
మంత్రి జోగి రమేష్ చేసిన వ్యాఖ్యల వీడియోను లోకేష్ ట్విట్టర్లో పోస్టు చేశారు. మంత్రి అయినా జోగి రమేష్ మారలేదంటూ ట్వీట్ చేశారు. తాము చెప్పేది వినకుంటే సంక్షేమ పథకాలు కట్ చేస్తామని మంత్రి చెప్పడం దారుణమన్నారు. చేయూత కార్యక్రమంలో వైసీపీ నేతల అబద్ధాలు వినలేక.. మధ్యలోనే వెళ్లిపోతున్న మహిళలను బెదిరించడం.. సభలో చెప్పేది వినకపోతే సంక్షేమ పథకాలు ఇవ్వమని.. చెప్పడం దారుణమంటూ లోకేష్ ట్వీట్ చేశారు.