విశాఖ నుంచి ఇండిపెండెంట్‌గా లక్ష్మీనారాయణ పోటీ

ABN , First Publish Date - 2022-12-24T03:54:36+05:30 IST

సీబీఐ మాజీ జాయింట్‌ డైరెక్టర్‌ లక్ష్మీనారాయణ వచ్చే ఎన్నికల్లో విశాఖపట్నం పార్లమెంటు స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగానే పోటీ చేస్తారని జేడీ ఫౌండేషన్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది.

విశాఖ నుంచి ఇండిపెండెంట్‌గా లక్ష్మీనారాయణ పోటీ

విశాఖపట్నం, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): సీబీఐ మాజీ జాయింట్‌ డైరెక్టర్‌ లక్ష్మీనారాయణ వచ్చే ఎన్నికల్లో విశాఖపట్నం పార్లమెంటు స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగానే పోటీ చేస్తారని జేడీ ఫౌండేషన్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. జేడీ ఫౌండేషన్‌ సభ్యులు, సన్నిహితుల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కో-ఆర్డినేటర్‌ జగన్‌ మురారి వెల్లడించారు. విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి జేడీ ఫౌండేషన్‌ కన్వీనర్‌ ప్రియాంక దండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని పేర్కొన్నారు.

Updated Date - 2022-12-24T03:54:37+05:30 IST