AP News: తుంగభద్ర జలాశయానికి కొనసాగుతున్న వరద
ABN , First Publish Date - 2022-08-10T16:49:06+05:30 IST
ఎగువన కురుస్తున్న వర్షాలకు (Rains) తుంగభద్ర జలాశయానికి వరద నీరు కొనసాగుతోంది.
కర్నూలు జిల్లా (Kurnool): ఎగువన కురుస్తున్న వర్షాలకు (Rains) తుంగభద్ర (Tungabhadra) జలాశయానికి వరద నీరు కొనసాగుతోంది. దీంతో అధికారులు 33 గేట్లను ఎత్తివేసి నీటిని దిగవకు విడదల చేశారు. పూర్తి స్థాయి నీటి మట్టం1633 అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం 1631.60 అడుగులుంది. ఇన్ ఫ్లో 1,70,591 క్యూసెక్కులుండగా.. ఔట్ ఫ్లో 1,64,090 క్యూ సెక్కులుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్ధ్యం 105.788 టీఎంసీలు.. కాగా ప్రస్తుతం నీటి నిల్వ సామర్ధ్యం 100.211 టీఎంసీలు ఉంది.