‘నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యం’
ABN , First Publish Date - 2022-03-23T05:31:13+05:30 IST
జిల్లాలోని విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నామని ఆపరేషన్ సర్కిల్ ఎస్ఈ కె.శివప్రసాద్ రెడ్డి తెలిపారు.
కల్లూరు, మార్చి 22: జిల్లాలోని విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నామని ఆపరేషన్ సర్కిల్ ఎస్ఈ కె.శివప్రసాద్ రెడ్డి తెలిపారు. మంగళవారం డయల్ యువర్ విద్యుత్ ఎస్ఈ కార్యక్రమంలో భాగంగా వినియోగదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. అధికారులు ఎక్కడైనా విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.