ఆర్యూలో ముగ్గురు విద్యార్థుల సస్పెన్షన్
ABN , First Publish Date - 2022-02-19T05:55:43+05:30 IST
రాయలసీమ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలలో ముగ్గురు బీటెక్ విద్యార్థులను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ వీ. హరిప్రసాదరెడ్డి తెలిపారు.
కర్నూలు(అర్బన్), ఫిబ్రవరి 18: రాయలసీమ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలలో ముగ్గురు బీటెక్ విద్యార్థులను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ వీ. హరిప్రసాదరెడ్డి తెలిపారు. ముగ్గురు విద్యార్థులు శుక్రవారం మధ్యాహ్నం 12.40 గంటల సమయంలో ఉద్యోగులతో ఘర్షణకు దిగి వాగ్వాదానికి దిగడంతో వారిని సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు.