అప్పుల బాధతో మున్సిపల్ కార్మికుడి ఆత్మహత్య
ABN , First Publish Date - 2022-07-07T07:06:52+05:30 IST
ఆదోని పట్టణంలో అప్పుల బాధతో మున్సిపల్ కార్మికులు బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు.
ఆదోని, జూలై 6: ఆదోని పట్టణంలో అప్పుల బాధతో మున్సిపల్ కార్మికులు బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. బుధవారం బావిలో మృతదేహం తేలడంతో చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడు మున్సిపల్ పారిశుధ్య కార్మికుడు వెంకటే్ష(30)గా పోలీసులు గుర్తించారు. అప్పుల బాధ, సం తానం కలగకపోవడం వంటి సమస్యలతో ఆత్మహత్య చేసుకున్నట్లు టూటౌన్ సీఐ గుణశేఖర్బాబు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.