వినాయక చవితి సందడి
ABN , First Publish Date - 2022-08-31T05:44:58+05:30 IST
వినాయక చవితి వేడుకలకు జిల్లా సిద్ధమైంది. వాడవాడలా చవితి పందిళ్లు వెలిశాయి.
మట్టి వినాయకులకు భారీ డిమాండ్
నంద్యాల (కల్చరల్)/ఆత్మకూరు, ఆగస్టు 30: వినాయక చవితి వేడుకలకు జిల్లా సిద్ధమైంది. వాడవాడలా చవితి పందిళ్లు వెలిశాయి. నంద్యాల జిల్లా కేంద్రంలోని గాంధీచౌక్, టెక్కె మార్కెట్టు యార్డు, నూనెపల్లె తదితర ప్రాంతాలు కొనుగోలుదారులతో మంగళవారం కిటకిట లాడాయి. వినాయకుడి పూజకు ఉపయోగించే 21రకాల పత్రాలు, మామిడి తోరణాలు, అరటి ఆకులు, వినాయక విగ్రహాలను కొనుగోలు చేశారు. గత సంవత్సరంతో పోల్చితే ఈ ఏడాది అధికసంఖ్యలో గణనాఽథులను నెలకొల్పుతున్నారు. మట్టి విగ్రహాలకు భారీ డిమాండ్ పెరిగింది. దీంతో గతంలో రూ.పది ఉండే మట్టి విగ్రహాలు ఈసారి రూ.వంద దాకా పలికాయి. ఆత్మకూరు పట్టణంలో విగ్రహాలను, పూజా సామగ్రిని కొనేందుకు ప్రజలు వివిధ గ్రామాల నుంచి వచ్చారు. దీంతో గౌడ్ సెంటర్ రద్దీగా కనిపించింది.