AP News: వైసీపీ కౌన్సిలర్ ఫయాజ్ తీరుపై సచివాలయ ఉద్యోగుల నిరసన
ABN , First Publish Date - 2022-09-08T22:05:35+05:30 IST
ఆదోని 39వ వార్డు వైసీపీ కౌన్సిలర్ ఫయాజ్ తీరుపై సచివాలయ ఉద్యోగులు ఆందోళన చేశారు.
కర్నూలు జిల్లా (Kurnool Dist.): ఆదోని 39వ వార్డు వైసీపీ కౌన్సిలర్ (YCP Councilor) ఫయాజ్ (Fhayaz) తీరుపై సచివాలయ ఉద్యోగులు (Secretariat employees) ఆందోళన (Protest) చేశారు. ఫయాజ్ తమ పట్ల దురుసుగా ప్రవర్తించారని నిరసన వ్యక్తం చేశారు. వైఎస్సార్ (YSR) చేయూత పథకానికి అబ్దిదారులతో ఫోటో దిగడానికి ఇంటికి వెళ్లిన ఉద్యోగిని అసభ్య పదజాలంతో దూషించారని వెల్ఫేర్ ఉద్యోగి లక్ష్మినారాయణ ఆరోపించారు. అనంతరం సచివాలయానికి వచ్చి చేయిచేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో సచివాలయం ఉద్యోగులు పురపాలక కార్యాలయం దగ్గర నిరసన తెలిపారు. కౌన్సిలర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డికి ఫిర్యాదు చేశారు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని కమిషనర్ వారికి హామీ ఇవ్వడంతో ఉద్యోగులు ఆందోళన విరమించారు.