మహానందీశ్వరుడి హుండీ లెక్కింపు
ABN , First Publish Date - 2022-11-30T00:28:32+05:30 IST
మహానంది క్షేత్రంలో మంగళవారం హుండీ లెక్కింపు నిర్వహించినట్లు ఆలయ ఈవో కాపు చంద్రశేఖర్రెడ్డి తెలిపారు.
మహానంది, నవంబరు 29: మహానంది క్షేత్రంలో మంగళవారం హుండీ లెక్కింపు నిర్వహించినట్లు ఆలయ ఈవో కాపు చంద్రశేఖర్రెడ్డి తెలిపారు. ప్రధాన ఆలయాల్లోని హుండీలతో పాటు అన్నదానం, గోశాల్లోని హుండీల్లో భక్తులు 49 రోజుల పాటు వేసిన కానుకలను ఆలయం పరిసరాల్లోని అభిషేక మంటపంలో సిబ్బంది సహాయంతో లెక్కించగా రూ. 63 లక్షల 71 వేల 256 ఈ ఆదాయం వచ్చిందన్నారు. ఇందులో ప్రధాన ఆలయాల హుండీల ద్వారా రూ. 62.45.311 అన్నదానం హుండీ ద్వారా రూ.78.063 గోశాల హుండీ ద్వారా రూ.47.882 ఆదాయం వచ్చినట్లు ఈవో పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలయ ఏఈవో ఎర్రమల్ల మధు, గ్రూపు దేవాలయాల ఈవో జనార్దనశెట్టి, పర్యవేక్షకులు వెంకటేశ్వర్లు, శశిధర్రెడ్డితో పాటు పాలకమండలి సభ్యులు గంగిశెట్టి మల్లికార్జునరావు, వీరభ