‘చిరు వ్యాపారులపై దాడులు ఆపాలి’
ABN , First Publish Date - 2022-11-25T01:05:46+05:30 IST
నగరంలో చిన్న చిన్న వ్యాపా రాలు చేసుకుంటూ జీవిస్తున్న వారిపై దాడులు చేయడం ఏమిటని రోడ్డు సైడు చిరు వ్యాపారుల సంఘం నగర అధ్యక్షుడు ఎన్ఎండీ షరీఫ్ ప్రశ్నించారు.
కర్నూలు(న్యూసిటీ), నవంబరు 24: నగరంలో చిన్న చిన్న వ్యాపా రాలు చేసుకుంటూ జీవిస్తున్న వారిపై దాడులు చేయడం ఏమిటని రోడ్డు సైడు చిరు వ్యాపారుల సంఘం నగర అధ్యక్షుడు ఎన్ఎండీ షరీఫ్ ప్రశ్నిం చారు. గురువారం కార్పొరేషన్ కార్యాలయం ఎదుట చిరు వ్యాపారులతో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా షరీఫ్ మాట్లాడుతూ నగరంలో స్మార్ట్ సిటీలో భాగంగా పుట్పాత్లపై చిన్న వ్యాపారులు ఉండకూడదని, షెడ్లు, తోపుడు బండ్లు, బంకులను తొలగించాలని వైసీపీ ప్రభుత్వం కంకణం కట్టుకో వడం దుర్మార్గమని అన్నారు. ఈ కార్యక్రమంలో మహబూబ్బాషా, అబ్దుల్ రహిమాన్, ఎం.రాజు, జమ్ములయ్య తదితరులు పాల్గొన్నారు.