Kurnool: టీడీపీలో చేరిన 2వేల మంది వైసీపీ కార్యకర్తలు..
ABN , First Publish Date - 2022-11-18T14:09:13+05:30 IST
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu naidu) మూడో రోజు శుక్రవారం కర్నూలు జిల్లా (Kurnool Dist.)లో పర్యటిస్తున్నారు.
కర్నూలు జిల్లా: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu naidu) మూడో రోజు శుక్రవారం కర్నూలు జిల్లా (Kurnool Dist.)లో పర్యటిస్తున్నారు. కర్నూలులోని మౌర్య హోటల్లో ఉదయం పది గంటలకు టీడీపీ (TDP) విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. అనంతరం జిల్లా టీడీపీ కార్యాలయంలో నూతనంగా నిర్మించిన అదనపు భవనం ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొని ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కర్నూలు టీడీపీ ఇంచార్జీ టీజీ భరత్ (TG Bharath) ఆధ్వర్యంలో 2వేల మంది వైసీపీ కార్యకర్తలు (YCP Activists) చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు.
ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ జగన్ పాలనలో 50 శాతం వెనుక బడిన వర్గాలకు అన్యాయం జరుగుతోందని అన్నారు. రాష్ట్రంలో ఇసుక, మద్యం, మైనింగ్ మాఫియా జరుగుతోందని ఆరోపించారు. వైసీపీ నేతలు దోపిడీ దొంగలుగా మారి దోచుకుంటున్నారని విమర్శిం
చారు. సైకో జగన్ రాష్ట్రాన్ని నాశనం చేసి.. మూడు రాజధానులంటూ డ్రామా మొదలు పెట్టారని చంద్రబాబు తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు.