Kurnoolలోనూ సేమ్ సీన్.. జగన్ ప్రసంగానికి ముందే జంప్
ABN , First Publish Date - 2022-07-06T00:14:04+05:30 IST
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదోనిలో పర్యటించారు. జగన్న విద్యా దీవెన కార్యక్రమం ప్రారంభం కాకముందే జనం సభ నుంచి...
కర్నూలు (Kurnool): ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి (Ap Cm Jagan Mohanreddy) ఆదోనిలో పర్యటించారు. జగన్న విద్యా దీవెన (Jagananna Vidya Deevena)కార్యక్రమం ప్రారంభం కాకముందే జనం సభ నుంచి వెళ్లిపోయారు. మంత్రి బొత్స సత్యనారాయణ (Bosta Satyanarayana) మాట్లాడుతుండగా తిన్నగా ఇంటిముఖం పట్టారు.
ఇటీవల కాలంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి సభల నుంచి జనం వెళ్లిపోతున్న విషయం తెలిసిందే. ప్రజల కోసం లక్షలు ఖర్చు పెట్టి సభలను ఏర్పాటు చేస్తున్నారు. ఎండ వచ్చినా.. వాన వచ్చినా ఎలాంటి అసౌకర్యం కలుగకుండా పటిష్టంగా ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ జగన్ సభల్లో ప్రజలు ఉండలేకపోతున్నారు. సీఎం జగన్ మాట్లాడిన తర్వాత వెళ్లిపోవడం సాధారణమనుకుంటే..కానీ ఆయన ప్రసంగం ప్రారంభం కాకముందే వెళ్లిపోతుండటం చర్చనీయాంశంగా మారింది.
అసలు సీఎం సభకు సంక్షేమ పథకాలపై కొత్త విషయాలు చెబుతారని ప్రజలు ఆశలు పెట్టుకుని వస్తారు. కానీ జగన్ ఎక్కువగా ప్రతిపక్ష నేత చంద్రబాబును విమర్శించడానికే సభా సమయాన్ని ఉపయోగిస్తుండటంతో ప్రజలు విసిగిపోతున్నారు. ప్రభుత్వం చేసిన పనులను కూడా ఓవర్గా చెబుతున్నారని.. రాష్ట్ర ప్రయోజనాలపై మాట్లాడటంలేదని అంటున్నారు. ప్రత్యేక హోదా, రాష్ట్రాభివృద్ధి, రాజధాని అంశాలను పూర్తిగా విస్మరించారని బహిరంగానే చెబుతున్నారు. ఇప్పటికైనా సీఎం జగన్.. ప్రతిపక్ష పార్టీలను, ప్రశ్నించిన మీడియా ఛానళ్లను విమర్శించడం మాని రాష్ట్రాభివృద్ధిపై ఫోకస్ చేయాలని సూచిస్తున్నారు.