శ్రీశైలం కుడి, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రాల్లో నిలిచిన విద్యుత్ ఉత్పత్తి
ABN , First Publish Date - 2022-02-23T13:55:40+05:30 IST
శ్రీశైలం కుడి, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది.
కర్నూలు: శ్రీశైలం కుడి, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వలు తగ్గిపోవడంతో ఏపీ, తెలంగాణ విద్యుత్ కేంద్రాలు విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేశాయి. శ్రీశైలం జలాశయం పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులు కాగా... ప్రస్తుత నీటిమట్టం 803.60 అడుగులకు చేరింది. అలాగే జలాశయం పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలకు గాను... ప్రస్తుతం నీటి నిల్వ 30 టీఎంసీలుగా నమోదు అయ్యింది. దీంతో కుడి, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది.