Judge Serious: పోలీసులతో నీళ్లు నమిలించిన జడ్జి
ABN , First Publish Date - 2022-09-28T01:50:22+05:30 IST
ఆదోనీలో పోలీసుల తీరు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఓ కేసులో జడ్జి ముందు ముద్దాయిని మరో కేసులో నిందితుడిగా..
కర్నూలు (Kurnool): ఆదోనీలో పోలీసుల తీరు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఓ కేసులో జడ్జి (Judge) ముందు ముద్దాయిని మరో కేసులో నిందితుడిగా ప్రవేశ పెట్టారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయమూర్తి పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.
ఓ కేసులో సంబంధం లేని వాళ్లను పోలీసులు ఎలా ఇరికిస్తారో.. జై భీమ్ సినిమా (Jai Bheem Movie)లో దర్శకుడు చక్కగా వివరించారు. అయితే పోలీసుల బుద్ధి మాత్రం మారడంలేదు.
కర్నూలు జిల్లా ఆదోనీ పోలీస్ స్టేషన్లో తప్పుడు కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. కర్ణాటక మద్యం అరికట్టామని చెప్పుకుంటూ పోలీసులు చేస్తున్న తీరు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
ఓ ముద్దాయి ఉదయం నుంచి సాయంత్రం వరకు కోర్టునే ఉన్నారు. అయితే పోలీసులు అతన్ను సిరిగప్ప క్రాస్ వద్ద పట్టుకున్నామని ప్రొసీడింగ్స్లో చూపారు. ముద్దాయిని గుర్తించిన జడ్జి అసలు విషయంపై ప్రశ్నించారు. దీంతో అవాక్కైన పోలీసులు నీళ్లు నమిలించారు. ఆగ్రహం వ్యక్తం చేసిన జడ్జి.. ఘటనపై పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.