వైసీపీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపండి

ABN , First Publish Date - 2022-12-10T01:31:59+05:30 IST

ప్రజావ్యతిరేక విధానాలను అవలం భిస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని బంగాళాఖా తంలో కలపాలని టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు పిలుపునిచ్చారు. అంబాపురం, పి. నైనవరం గ్రామాలలో ఇదేం ఖర్మం మన రాష్ట్రానికి కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఇంటింటికి తిరిగి వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

 వైసీపీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపండి

విజయవాడ రూరల్‌, డిసెంబరు 9 : ప్రజావ్యతిరేక విధానాలను అవలం భిస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని బంగాళాఖా తంలో కలపాలని టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు పిలుపునిచ్చారు. అంబాపురం, పి. నైనవరం గ్రామాలలో ఇదేం ఖర్మం మన రాష్ట్రానికి కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఇంటింటికి తిరిగి వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుతోనే రాష్ట్రం అభివృద్ధి జరిగిందని, 2024 ఎన్నికల్లో తిరిగి చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మచిలీపట్నం పార్లమెంట్‌ ఉపాధ్యక్షుడు దండు సుబ్రహ్మణ్యంరాజు, గొడ్డళ్ల చిన్నరామారావు, గ్రామ పార్టీ నేతలు సిద్దిల రాజా, చెప్పిడి రమేష్‌, ఎస్‌కె. నభి, బాబురావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-10T01:32:02+05:30 IST