చక్రబంధం
ABN , First Publish Date - 2022-06-07T06:34:58+05:30 IST
చక్రబంధం
విజయవాడ, జూన్ 6 : బీజేపీ కోర్ కమిటీ సమావేశం నిమిత్తం ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాకతో సోమవారం నగరంలో ట్రాఫిక్ అస్తవ్యస్తమైంది. బెంజిసర్కిల్ నుంచి రామవరప్పాడు వెళ్లే జాతీయ రహదారి మొత్తం దిగ్బంధమైంది. ఎక్కడికక్కడ పోలీసులు ట్రాఫిక్ను నిలుపుదల చేయడంతో బెంజిసర్కిల్-1 ఫ్లై ఓవర్పై వాహనాలు బారులు తీరి కనిపించాయి. చాలాసేపు ఇదే పరిస్థితి కొనసాగడంతో వాహనదారులు నరకం అనుభవించారు.