Lokesh: సీఎం ఇంటి ముందే మహిళ ఆత్మహత్యాయత్నం... ఇంతకంటే ఘోరం ఉంటుందా?
ABN , First Publish Date - 2022-11-02T15:26:09+05:30 IST
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నివాసం ముందు ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు.
అమరావతి: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (YS jagan mohan reddy) నివాసం ముందు ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) స్పందించారు. ‘‘ముఖ్యమంత్రి జగన్ రెడ్డి (AP News) గారి ఇంటి ముందే న్యాయం కోసం ఒక మహిళ ఆత్మహత్యాయత్నం చేసిందంటే ఇంతకంటే ఘోరం ఉంటుందా’’ అని ప్రశ్నించారు. సొంత తల్లి, చెల్లిని తరిమేసిన జగన్ రెడ్డి (AP CM) పాలనలో సామాన్య మహిళల కష్టాలు తీరుతాయనుకోవడం అత్యాశే అని అన్నారు. తాడేపల్లి ప్యాలెస్లో అభినవ నీరో జగన్ రెడ్డికి కాకినాడలో వైసీపీ నేతల (YCP Leaders) అరాచకాలు కనపడవని మండిపడ్డారు. అచేతన స్థితిలో ఉన్న కుమార్తెకి వైద్యం చేయించలేని ఆడపడుచు ఆరుద్ర ఆత్మహత్యాయత్నం ఆర్తనాదాలు వినపడవన్నారు. ఆ బిడ్డ వైద్యానికి తక్షణమే సాయం అందించాలని లోకేష్ (TDP Leader) డిమాండ్ చేశారు.