Bonda Uma: సీఎం జగన్ ఏపీని నేరాలకు నెంబర్1 రాష్ట్రంగా మార్చారు..

ABN , First Publish Date - 2022-12-06T14:17:30+05:30 IST

వైసీపీ (YCP) అవినీతి పరులు.. హైటెక్ పద్ధతిలో చేసిన దోపిడీని ఐటీ (IT) శాఖ పరిగణనలోకి తీసుకున్నట్లుందని, దాడుల సారాంశాన్ని అధికారులు వెల్లడించాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు (Bonda Uma) అన్నారు.

Bonda Uma: సీఎం జగన్ ఏపీని నేరాలకు నెంబర్1 రాష్ట్రంగా మార్చారు..

అమరావతి: వైసీపీ (YCP) అవినీతి పరులు.. హైటెక్ పద్ధతిలో చేసిన దోపిడీని ఐటీ (IT) శాఖ పరిగణనలోకి తీసుకున్నట్లుందని, దాడుల సారాంశాన్ని అధికారులు వెల్లడించాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు (Bonda Uma) అన్నారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ప్రజల దగ్గర డబ్బులు కొట్టేసిన వారిలో అవినాష్ (Avinash), వంశీ (Vamsi) లాంటి గూడుపుఠాణీ బ్యాచ్ ఉందని, ఏపీని నేరాలకు నెంబర్1 రాష్ట్రంగా సీఎం జగన్ (CM Jagan) మార్చారని విమర్శించారు. మాదకద్రవ్యాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఏపీ మారటంపై ముఖ్యమంత్రి ఏం సమాధానం చెప్తారన్నారు. ‘స్మగ్లింగ్ ఇన్ ఇండియా నివేదిక’లో ఏపీ నెంబర్1గా నిలవటంపై వైసీపీ నేతలు తలెక్కడ పెట్టుకుంటారని ప్రశ్నించారు. రోజుకు సగటున 8మంది మహిళలపై ఏపీలో అఘాయిత్యాలు జరగటానికి కారణం డ్రగ్స్ అని అన్నారు. జే గ్యాంగ్ ఆధ్వర్యంలోనే రాష్ట్రంలో గంజాయి సాగవుతోందని, ఆన్ లైన్‌లో గంజాయి కొనుగోలు చేసుకునే వెసులుబాటు వైసీపీ కల్పించిందన్నారు. డబ్బు పిచ్చితో ఏపీ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీశారని బోండా ఉమ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Updated Date - 2022-12-06T14:17:34+05:30 IST