Chandrababu: నీతి ఆయోగ్ సీఈవోతో చంద్రబాబు భేటీ

ABN , First Publish Date - 2022-12-06T15:13:59+05:30 IST

నీతి ఆయోగ్ సీఈవో పరమేశ్వరన్‌‌తో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు.

Chandrababu: నీతి ఆయోగ్ సీఈవోతో చంద్రబాబు భేటీ

న్యూఢిల్లీ: నీతి ఆయోగ్ సీఈవో పరమేశ్వరన్‌‌తో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భేటీ (TDP Chief Chandrababu met NITI Aayog CEO Parameswaran) అయ్యారు. డిజిటల్ నాలెడ్జ్ విజన్ డాక్యుమెంట్‌పై సీఈవోతో చర్చించారు. జీ-20 సమావేశంపై పరమేశ్వరన్‌తో మాట్లాడాలని చంద్రబాబును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(Prime minister Narendra Modi) కోరారు. ప్రధాని మోదీ సూచన మేరకు నీతి ఆయోగ్ సీఈవోను టీడీపీ అధినేత కలిశారు. ఈ సందర్భంగా విజన్ డాక్యుమెంట్‌ నోట్‌ను పరమేశ్వరన్‌కు అందించారు. వచ్చే 25 ఏళ్లకు భారత్‌ విజన్‌పై డాక్యుమెంట్‌ సిద్ధం చేసుకోవాలని అన్నారు. 25 ఏళ్లలో దేశం నంబర్‌ వన్‌గా అవతరిస్తుందని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు.

Updated Date - 2022-12-06T15:17:35+05:30 IST