సిప్ పరీక్షలో సిద్ధార్థ చిన్నారుల ప్రతిభ
ABN , First Publish Date - 2022-12-30T00:52:07+05:30 IST
అబాకస్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన సిప్ (గణితంలో వేగవంతమైన గణన) పరీక్షలో మొగల్రాజపురం వీరమాచనేని పద్దయ్య సిద్ధార్థ పబ్లిక్ పాఠశాల విద్యార్థులు 43 మంది రాష్ట్ర స్థాయిలో ఉత్తీర్ణులయ్యారు.
సిప్ పరీక్షలో సిద్ధార్థ చిన్నారుల ప్రతిభ
విజయవాడ కల్చరల్, డిసెంబరు 29 : అబాకస్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన సిప్ (గణితంలో వేగవంతమైన గణన) పరీక్షలో మొగల్రాజపురం వీరమాచనేని పద్దయ్య సిద్ధార్థ పబ్లిక్ పాఠశాల విద్యార్థులు 43 మంది రాష్ట్ర స్థాయిలో ఉత్తీర్ణులయ్యారు. ఈ 43 మంది విద్యార్థులు జాతీయ స్థాయి పరీక్ష రాసేందుకు అర్హత పొందారు. ఈ సందర్భంగా పాఠశాల సంచాలకులు ఎం.సీతారామయ్య, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సిహెచ్.జయలక్ష్మి జాతీయ స్థాయిలో ఎంపికైన విద్యార్థులను అభినందించి ప్రశంసా పత్రాలను, పతకాలను అందజేశారు.