సమరయోధులను మరువరాదు
ABN , First Publish Date - 2022-08-15T06:48:21+05:30 IST
సమరయోధులను మరువరాదు
గన్నవరం, ఆగస్టు 14: స్వాతంత్య్ర సమర యోధులను మరువకూడ దని జడ్పీటీసీ సభ్యు రాలు అన్నవరపుఎలిజిబెత్ రాణి అన్నారు. గన్నవరం పట్ట ణంలో పలువురు స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబా లను సందర్శించి ఆదివారం దుశ్శాలువ, పూలబొకేలతో సత్కరించారు. సమరయోధులు సూరప నేని ప్రభాకరరావు, వెలివెల సీతారామయ్య, మద్దుకూరి సత్యనారాయణ కుటుం బాలను కలిసినట్లు తెలిపారు. సర్పంచ్ నిడమర్తి సౌజన్య, జడ్పీ మాజీ కో-ఆప్షన్ సభ్యులు కలాం, ఏఎంసీ మాజీ డైరెక్టర్ సూరెడ్డి మణిమ్మ, షేక్ రఫీ, తాడిగడప రవి, రాధా కృష్ణ, గండికోట సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు.