చిన్నదెబ్బ కొట్టినా ఫీలైపోతున్నారు

ABN , First Publish Date - 2022-09-11T06:27:56+05:30 IST

చిన్నదెబ్బ కొట్టినా ఫీలైపోతున్నారు

చిన్నదెబ్బ కొట్టినా ఫీలైపోతున్నారు
బందరు రోడ్డులో జరిగిన భారీ ర్యాలీ

ర్యాలీ ప్రారంభోత్సవంలో డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి

విజయవాడ, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి) : భయపెట్టడానికి పోలీస్‌స్టేషన్‌లో చిన్నదెబ్బ కొట్టినా ఫీలైపోతున్నారని డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి వ్యాఖ్యానించారు. అందుకోసమే పోలీసు శాఖలో ఇన్సల్టింగ్‌ బిహేవియర్‌ ఉండొద్దని చెబుతున్నామన్నారు. ఆత్యహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర మానసిక వైద్యుల సంఘం ఆధ్వర్యంలో నగరంలో శనివారం ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని డీజీపీ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో గంజాయిపై ఉక్కుపాదం మోపామన్నారు. విశాఖ మన్యంలో గిరిజనులు గంజాయికి ప్రత్యామ్నాయంగా మరో పంటలు వేస్తున్నారన్నారు. అలాగే, డ్రగ్‌ మాఫియాను అణచివేస్తున్నామన్నారు. త్వరలోనే మంచి ఫలితాలు వస్తాయన్నారు. 18 నుంచి 35 ఏళ్లలోపు వారే ఎక్కువగా ఆత్మహత్య చేసుకుంటున్నారని చెప్పారు. 







Updated Date - 2022-09-11T06:27:56+05:30 IST