AP News.. ఎన్టీఆర్ జిల్లా: గొల్లపూడిలో దారుణం
ABN , First Publish Date - 2022-09-29T21:07:33+05:30 IST
గొల్లపూడిలో దారుణం జరిగింది. తల్లీ కూతుళ్లు అపార్టుమెంట్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు.
ఎన్టీఆర్ జిల్లా (NTR Dist.): గొల్లపూడిలో దారుణం జరిగింది. తల్లీ కూతుళ్లు అపార్టుమెంట్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఆరో అంతస్తు నుంచి కిందకు దూకడంతో అక్కడిక్కడే మృతి చెందారు. మృతులు బొప్పన సత్యవతి, కందుల మాధవిగా గుర్తించారు. సమాచారం అందుకున్న భవానీపురం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
సిఐ ఉమర్ మాట్లాడుతూ తల్లి సత్యవతి, ఆమె కుమార్తె మాధవి ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. ముందుగా నిర్ణయించుకునే ఇద్దరూ అపార్టుమెంట్ వద్దకు వచ్చారన్నారు. లిప్ట్లో పైకివెళ్లి ఆరో అంతస్తు నుంచి కిందకి దూకారని తెలిపారు. అపార్టుమెంట్ పక్క వీధిలో సొంత ఇంటిలో నివాసం ఉంటున్నారని, అనారోగ్య కారణాల వల్లే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోందన్నారు. సీపీ కెమెరాలు పరిశీలిస్తున్నామని, దర్యాప్తు పూర్తి అయ్యాక అన్ని వివరాలు వెల్లడిస్తామని సిఐ ఉమర్ అన్నారు.