యోగాతో మానసిక ఉల్లాసం

ABN , First Publish Date - 2022-10-11T06:12:11+05:30 IST

యోగాతో మానసిక ఉల్లాసం, ఆరోగ్యంగా ఉండవచ్చని మైలవరం న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్‌ షేక్‌ షిరీన్‌ అన్నారు.

యోగాతో మానసిక ఉల్లాసం
సదస్సులో మాట్లాడుతున్న జడ్జి షేక్‌ షిరీన్‌

సదస్సులో న్యాయమూర్తి షిరీన్‌

మైలవరం, అక్టోబరు 10: యోగాతో మానసిక ఉల్లాసం, ఆరోగ్యంగా ఉండవచ్చని మైలవరం న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్‌ షేక్‌ షిరీన్‌ అన్నారు. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా న్యాయ సేవాధికార సంస్థ సోమవారం కోర్టు ఆవరణలో సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిఽథిగా పాల్గొని మాట్లాడుతూ కుటుంబ సభ్యులతో ఆధునిక యుగంలో సరైన సంబంధాలు లేకపోవడం, తల్లిదండ్రులు ఉద్యోగాలతో పిల్లల పట్ల సరైన సాన్నిహిత్యం లేక ఆందోళనతో రోజులు గడుస్తున్న తరుణంలో 1992వ సంవత్సరంలో ప్రపంచ వ్యాప్తంగా అక్టోబరు 10న ప్రపంచ మానసిక ఆరోగ్య కార్యక్రమాన్ని జరుపుకున్నట్టు తెలిపారు.  కార్యక్రమానికి మైలవరం బార్‌ అసోసియేషన్‌ మాజీ అధ్యక్షుడు బుద్ధ వరపు వెంకట్రావు అధ్యక్షత వహించగా న్యాయవాది తనూజ్‌, యోగా ఉపాధ్యాయురాలు లలిత, బాలాజీ ప్రసాద్‌, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2022-10-11T06:12:11+05:30 IST