Kodali Nani: ఎటువంటి రిమార్క్ లేకుండా ఎన్నికలకు వెళ్తాం...

ABN , First Publish Date - 2022-11-02T15:36:29+05:30 IST

గుడివాడ 36వ వార్డులో నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మాజీ మంత్రి కొడాలి నాని, మచిలీపట్నం పార్లమెంట్ సభ్యుడు వల్లభనేని బాలశౌరి పాల్గొన్నారు.

Kodali Nani: ఎటువంటి రిమార్క్ లేకుండా ఎన్నికలకు వెళ్తాం...

కృష్ణాజిల్లా: గుడివాడ 36వ వార్డులో నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మాజీ మంత్రి కొడాలి నాని, మచిలీపట్నం పార్లమెంట్ సభ్యుడు వల్లభనేని బాలశౌరి పాల్గొన్నారు. ఈ సందర్బంగా రూ. కోటి 50 లక్షల అమృత్ విధులతో నిర్మించిన వాటర్ ట్యాంక్‌ను ప్రారంభించారు. అనంతరం కొడాలి నాని మాట్లాడుతూ రాష్ట్రంలోని పేదల కోసం ముఖ్యమంత్రి బూతులు తిట్టించుకుంటున్నారని, జగన్‌ను ఓడించాలని రాజకీయ శక్తులన్ని కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. ఇంగ్లీష్ మీడియం విద్యపై సైతం ప్రతిపక్షాలు పనికిమాలిన విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఎటువంటి రిమార్క్ లేకుండా ఎన్నికలకు వెళ్తామన్నారు. గుడివాడ ప్రజల రుణం తీర్చుకోవడానికి ప్రతి క్షణం పాటుపడతానన్నారు. గుడివాడ నియోజకవర్గం అబివృద్ధికి కృషి చేసిన బాలశౌరికి కొడాలి నాని ధన్యవాదాలు తెలిపారు.

ఎంపీ బాలశౌరి మాట్లాడుతూ వచ్చే నెలలలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా మచిలీపట్నం పోర్ట్ నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. జల్ జీవన్ మిషన్ ద్వారా గ్రామాల్లో ఇంటింటికి త్రాగు నీటి పైప్ లైన్ వేస్తామన్నారు. వందలాది కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులతో గుడివాడ అభివృద్ధికి చర్యలు చేపడతామని చెప్పారు.

Updated Date - 2022-11-02T15:36:32+05:30 IST