కార్మిక చట్టాలను కాలరాస్తున్న పాలకులకు బుద్ధి చెప్పాలి

ABN , First Publish Date - 2022-03-23T06:19:21+05:30 IST

కార్మిక చట్టాలను కాలరాస్తున్న పాలకులకు బుద్ధి చెప్పాలి

కార్మిక చట్టాలను కాలరాస్తున్న పాలకులకు బుద్ధి చెప్పాలి
కార్మికులతో మాట్లాడుతున్న వై.నరసింహారావు

గన్నవరం, మార్చి 22 : కార్మిక చట్టాలను కాలరాస్తున్న పాలకులకు తగిన బుద్ధి చెప్పాలని సీఐటీయూ తూర్పు కృష్ణా జిల్లా ఉపాధ్యక్షుడు వై.నరసింహారావు అన్నారు. మండలంలోని సూరంపల్లి పారిశ్రామికవాడలో మంగళవారం కార్మికు లతో గేటు మీటింగ్‌లు నిర్వహించి ఈ నెల 28, 29 తేదీల్లో కేంద్ర కార్మిక సంఘాలు తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెలో పాల్గొని జయ ప్రదం చేయాలని పిలుపునిచ్చారు.  ఈ సంద ర్భంగా వై.నరసింహారావు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా పోరాడిసాధించుకున్న కార్మిక చట్టాలను కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కార్పొరేట్లకు అను కూలంగా మారుస్తుందన్నారు. కార్మికుల సంక్షేమానికి తూట్లు పొడుస్తున్నారని మండిపడ్డారు. కార్మిక వ్యతిరేక విధానాలు ఆవలంభించిన ఏ ప్రభుత్వం రాణించిన చరిత్ర లేదన్నారు. నాయకులు కళ్లం వెంకటేశ్వరరావు, బెజవాడ తాతబ్బాయి పాల్గొన్నారు. 

Updated Date - 2022-03-23T06:19:21+05:30 IST