ఉద్యోగులపై వేధింపులు ఆపాలి

ABN , First Publish Date - 2022-12-12T01:14:44+05:30 IST

కొత్త జీవోలతో ఉద్యోగులను వేధించ డాన్ని ప్రభుత్వం ఆపాలని, దీనిపై పోరాటం సాగిస్తామని ఐఎన్‌టీ యూసీ అధ్యక్షుడు జి.సంజీవరెడ్డి హెచ్చరించారు. తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో ఆదివారం ఐఎన్‌టీయూసీ అనుబంధ ఏపీ ప్రజా రోగ్య, వైద్య ఉద్యోగుల సంఘం 29వ జనరల్‌ బాడీ సమావేశాన్ని నిర్వహించారు.

ఉద్యోగులపై వేధింపులు ఆపాలి
మాట్లాడుతున్న ఐఎన్‌టీయూసీ అధ్యక్షుడు సంజీవరెడ్డి

వన్‌టౌన్‌, డిసెంబరు 11: కొత్త జీవోలతో ఉద్యోగులను వేధించ డాన్ని ప్రభుత్వం ఆపాలని, దీనిపై పోరాటం సాగిస్తామని ఐఎన్‌టీ యూసీ అధ్యక్షుడు జి.సంజీవరెడ్డి హెచ్చరించారు. తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో ఆదివారం ఐఎన్‌టీయూసీ అనుబంధ ఏపీ ప్రజా రోగ్య, వైద్య ఉద్యోగుల సంఘం 29వ జనరల్‌ బాడీ సమావేశాన్ని నిర్వహించారు. సంజీవరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యలను ఆయన ప్రస్తావించారు. చట్టాల అమలుకు కార్మిక సంఘాలు పోరాడాలని పిలుపునిచ్చారు. ఏపీ ప్రజారోగ్య వైద్య ఉద్యోగుల సంఘం ఎన్నికలను ఆయన ధ్రువీకరిం చారు. ఏపీలో ఆస్కారరావు నాయకత్వంలో సంఘం పటిష్టంగా ఉంద న్నారు. సభ్యులు సంఘానికి పూర్వవైభవం తీసుకురావాలని సూచిం చారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్‌ సూర్య నారాయణ మాట్లాడుతూ.. ట్రేడ్‌ యూనియన్‌ వ్యవస్థ స్తబ్ధుగా ఉన్న తరుణంలో సంఘం ఎన్నికలు జరగడం శుభ పరిణామమన్నారు. ఆస్కారరావు నేతృత్వంలో తామంతా కలిసి పోరాడతామని, సంక్రాంతి తరువాత కొత్త జీవోలతో ప్రభుత్వ వేధింపులకు వ్యతిరేకంగా పోరాటం సాగిస్తామని ఆయన హెచ్చరించారు.

Updated Date - 2022-12-12T01:14:45+05:30 IST