Nara Lokesh: అమరావతి రైతుల మహాపాదయాత్ర ప్రారంభం.. పాల్గొననున్న నారా లోకేష్..
ABN , First Publish Date - 2022-09-12T17:49:07+05:30 IST
ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ అమరావతి రైతులు చేస్తున్న ఉద్యమానికి నేటితో...
అమరావతి (Amaravathi): ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ అమరావతి రైతులు చేస్తున్న ఉద్యమానికి నేటితో 1000 రోజులు. ఈ సందర్భంగా రైతులు చేపట్టనున్న మహాపాదయాత్ర (Maha Padayatra) సోమవారం ఉదయం ప్రారంభమైంది. అమరావతి నుంచి అరసవెల్లి వరకు మహాపాదయాత్ర చేయనున్నారు.
సోమవారం ఉదయం వెంకటపాలెం శివారు టీటీడీ ఆలయంలో రైతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచే రైతులు మహాపాదయాత్ర ప్రారంభించారు. తొలిరోజు మంగళగిరి వరకు పాదయాత్ర కొనసాగనుంది. పాదయాత్రలో పార్టీలకతీతంగా పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు. పాదయాత్రలో ప్రత్యేక ఆకర్షణగా వెంకటేశ్వరస్వామి రథం నిలిచింది. రైతుల మహాపాదయాత్రకు టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్, జనసేన పార్టీలు మద్దతు ప్రకటించాయి. కాగా టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ రైతులతో కలిసి పాదయాత్రలో పాల్గొనునున్నారు. 900కి.మీ పైగా సాగనున్న అమరావతి రైతుల మహాపాదయాత్ర.. నవంబర్ 11న ముగియనుంది.