ముగిసిన సేవా పక్షోత్సవాలు
ABN , First Publish Date - 2022-10-04T06:07:32+05:30 IST
పరిసరాల పరిశుభ్రత పాటిస్తే ఆరోగ్యంగా ఉండవచ్చని ప్రాంతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ ఇన్చార్జ్ అధికారి డాక్టర్ మురళీ అన్నారు.
ముగిసిన సేవా పక్షోత్సవాలు
పాయకాపురం, అక్టోబరు 3 : పరిసరాల పరిశుభ్రత పాటిస్తే ఆరోగ్యంగా ఉండవచ్చని ప్రాంతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ ఇన్చార్జ్ అధికారి డాక్టర్ మురళీ అన్నారు. రాజీవ్నగర్లోని ప్రాంతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థలో సోమవారం సేవా పక్షోత్సవాల ముగింపు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన సంస్థ తరపున నిర్వహించిన వివిధ కార్యక్రమాలను వివరించారు. టీహెచ్సీఆర్పీ, ఎస్సీఎస్పి ద్వారా రోగులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి, మందులు పంపిణీ చేశారు. అనంతరం సంస్థ ప్రాంగణాన్ని శుభ్రం చేసి, మొక్కలు నాటి, రోగులకు కోవిడ్ వ్యాక్సినేషన్ నిర్వహించారు. పరిశోధన అధికారి సవిత పోశెట్టి గోపోడ్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో సంస్థ వైద్యులు, రోగులు పాల్గొన్నారు.