ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టొద్దు
ABN , First Publish Date - 2022-12-30T00:30:54+05:30 IST
ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టటం మంచి పద్ధతి కాదని సీపీఐ జిల్లా కార్యదర్శి కోటేశ్వరరావు అన్నారు.
వీరులపాడు: ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టటం మంచి పద్ధతి కాదని సీపీఐ జిల్లా కార్యదర్శి కోటేశ్వరరావు అన్నారు. మండల కేంద్రాన్ని తరలించవద్దని కోరుతూ చేపట్టిన రిలే దిక్షలకు గురువారం సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 14 రోజులుగా రిలే దీక్షలు చేస్తున్నా అధికారులు, ప్రజా ప్రతినిధులు కనీసం స్పందించకపోవటం బాధాకరమన్నారు. ఇప్పటికైనా పాలకులు స్పందించి వీరులపాడును మండల కేంద్రంగా యధావిధిగా కొనసాగించాలని కోరారు. ఈ దీక్షలో కోట నరసింహారావు, గురజాల కిషోర్, బట్ట కృష్ణ, కర్నాటి రవికుమార్, దొడ్డపునేని రంగారావు, గురజాల అజయ్, తదితరులు కూర్చున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆంబోజి శివాజీ, అబ్దుల్లా, వట్టికొండ చంద్రమోహన్, వాసిరెడ్డి రాధకృష్ణ పాల్గొన్నారు.