ఒకరు మృతి.. 102 కొత్త కేసులు
ABN , First Publish Date - 2022-02-16T06:43:38+05:30 IST
జిల్లాలో కొత్తగా 102 మంది కరోనా వైరస్ బారినపడ్డారు.
విజయవాడ, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో కొత్తగా 102 మంది కరోనా వైరస్ బారినపడ్డారు. వీటితో కలిపి జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,36,312కు పెరిగింది. మరణాలు 1,487కు చేరుకున్నాయి. ఇంకా 2,559 మంది కొవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు 1,32,266 మంది వ్యాధి నుంచి కోలుకున్నారని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.