చెత్త సంపద కేంద్రాలను వినియోగంలోకి తేవాలి
ABN , First Publish Date - 2022-11-03T00:41:03+05:30 IST
చెత్తనుంచి సంపద తయారు చేసే కేంద్రాల్లో (ఎస్డబ్ల్యూపీసీలు) తాగు నీరు, విద్యుత్ సౌకర్యం కల్పించి, పూర్తిస్థాయిలో వినియోగంలోకి తేవాలని పంచాయతీ రాజ్ రీసోర్స్ కేంద్రం జిల్లా కో-ఆర్డినేటర్ పి.మురళీ కృష్ణప్రసాద్ తెలిపారు. ఎంపీడీవో జీఎస్వీ శేషగిరిరావు అధ్యక్షతన ఉంగుటూరు మండలంలోని అన్ని గ్రామాల గ్రేడ్-1, 5 కార్యదర్శులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో ఎస్డబ్ల్యూపీసీల పనితీరు, క్లాప్ మిత్రల వేతన చెల్లింపులు, జలజీవన్ మిషన్, డీఆర్సీ తదితర అంశాలపై స్ధానిక స్త్రీశక్తిభవనం సమావేశహాలులో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఉంగుటూరు, నవంబరు 2 : చెత్తనుంచి సంపద తయారు చేసే కేంద్రాల్లో (ఎస్డబ్ల్యూపీసీలు) తాగు నీరు, విద్యుత్ సౌకర్యం కల్పించి, పూర్తిస్థాయిలో వినియోగంలోకి తేవాలని పంచాయతీ రాజ్ రీసోర్స్ కేంద్రం జిల్లా కో-ఆర్డినేటర్ పి.మురళీ కృష్ణప్రసాద్ తెలిపారు. ఎంపీడీవో జీఎస్వీ శేషగిరిరావు అధ్యక్షతన ఉంగుటూరు మండలంలోని అన్ని గ్రామాల గ్రేడ్-1, 5 కార్యదర్శులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో ఎస్డబ్ల్యూపీసీల పనితీరు, క్లాప్ మిత్రల వేతన చెల్లింపులు, జలజీవన్ మిషన్, డీఆర్సీ తదితర అంశాలపై స్ధానిక స్త్రీశక్తిభవనం సమావేశహాలులో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఎఫ్టీసీ కమలాకర్, ఎస్డబ్ల్యూఎం కన్సల్టెంట్ నాగేశ్వరమ్మ, ఈవోపీఆర్డీ ఎం.అమీర్బాషా, కార్యదర్శులు, సర్పంచ్లు పాల్గొన్నారు.