రొమ్ము, గర్భాశయ కేన్సర్లను తొలి దశలోనే గుర్తించాలి
ABN , First Publish Date - 2022-08-15T06:47:18+05:30 IST
రొమ్ము, గర్భాశయ కేన్సర్లను తొలి దశలోనే గుర్తించాలి
పెనమలూరు, ఆగస్టు 14 : ప్రాణాంతక రొమ్ము, గర్భాశయ కేన్సర్లను తొలిదశలోనే గుర్తిస్తే పూర్తిగా నయం చేయవచ్చని కేన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ పాటిబండ్ల అనీల పేర్కొన్నారు. ఆది వారం రూట్స్ హెల్త్, అమెరికన్ ఆంకాలజీ సంస్థల సహకారంతో అశోక్నగర్లోని సోమనాధ్ ఆసుపత్రిలో జరిగిన కేన్సర్పై అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. రూట్స్ కన్వీనర్ మాధవి డాక్టర్ పోలవరపు విజయభాస్కర్, వామనమూర్తి, కరంకౌర్, శారదావాణి తదితరులు పాల్గొన్నారు.